HomePOLITICAL NEWSUncategorizedరైలు కింద పడి మహిళ ఆత్మహత్య...

రైలు కింద పడి మహిళ ఆత్మహత్య…

రైలు కింద పడి మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి ఉప్పల్వాయి రైల్వే స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రైల్వే ఎస్ఐ సాయి రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం…

కామారెడ్డి ఉప్పల్వాయి రైల్వే స్టేషన్ మధ్య సుమారు 35 వయస్సు గల గుర్తు తెలియని మహిళ రైలు కింద పడి మృతి చెందినట్లు తెలిపారు.

స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలి వద్ద ఎలాంటి వివరాలు లభించలేదు.

మృతురాలి మీద లేత ఆకుపచ్చ రంగు చీర ఉందని తెలిపారు.మృతురాలి వివరాలు తెలిసిన వారు రైల్వే ఎస్ఐ 8712658591 నంబర్ కు ఫోన్ చేసి సమాచారం అందించాలని ఎస్ఐ సాయి రెడ్డి పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments